5, నవంబర్ 2022, శనివారం

 దాశరథి కి నివాళి 


కవిత్వ సంపదకు శరథి 

గభీరతకు మహోదధి దాశరథి 

తెలంగాణ గడ్డపై పుట్టిన ధీమణి 

నిరంకుశ పాలనకు ఎక్కుపెట్టిన గుణి 

ఆంధ్ర దేశ ఆస్థాన పీఠి నలంకరించినవాఁడు 

అలనాటి చిత్రసీమను పాటలతో నలరించినవాఁడు .

నైజాము పాలకుల తూర్పార పట్టిన ' అగ్నిధార

బడుగు పేదల వెతల కతల వాణి 'రుద్రవీణ

కవితలెన్నొ వ్రాసిఘనత కెక్కినఘనుఁడు 

బిరుదులెన్నొ గొన్న ' కవిసింహము '

రచన లెన్నొచేసి రాణ కెక్కిన కళారవి 

మన దాశరథి కృష్ణమాచార్య సుకవి .



డా కోమలరావు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి