26, జులై 2015, ఆదివారం

పుష్కర గోదావరి

పుష్కర గోదావరి

పరవళ్లు తొక్కింది గోదావరి 
పరవశించిపోయింది గోదావరి  
నాసిక్ లోపుట్టింది తెలుగింటికొచ్చింది
తెలుగు రాష్ట్రాలలో చక్కర్లు కొట్టింది ' 
గౌతముని పాపాలు కడు గంగ 
గౌతమి గ వచ్చింది గంగ .దివిజ గంగ . 
కవులకు కాణాచి గౌతమీ తీరం .
ప్రజలకందించింది మహాభారత సారం . .... పరవళ్లు తొక్కింది గోదావరి 

బాసరలో భారతికి పాదాలు కడిగింది .. 
రాణ్మహేంద్రంలో రాగాలు పలికింది
సప్తర్షి స్పర్శ చే సప్త గోదావరైంది
కవుల  ఘంటాలలో కావ్యమై నిలిచింది
పాడి పంటలనిచ్చి అన్నపూర్ణ అయింది  ....  పరవళ్లు తొక్కింది గోదావరి


ప్రకృతి మాతకు జీవధారగ నిలిచింది 
**పోల'వరమ్మ్మై' విద్యుత్తు  కాంతులీనేను 
చమురు వాయువులకు క్షేత్రమై పొంగింది
సగటు ఆంధ్రుని కొంగు బంగారమైంది.     పరవళ్లు తొక్కింది గోదావరి    ( by Komalarao ). 

** భవిష్యత్తు లో 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి